Chennai: చెన్నైలో కూలిన భవనం.. ఒకరి మృతి!

  • కండంచవాడి ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
  • ఒకరు మృతి.. 17 మందికి గాయాలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ భాగం కుప్పకూలిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి కండంచవాడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి అని, ఐరన్ గిడ్డర్లు కూలడంతో 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే 8 అంబులెన్సులు, 3 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న 23 మందిని రక్షించారు. రక్షించిన వారిలో ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు చెన్నై కలెక్టర్ పొన్నియన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు.

More Telugu News