Pawan Kalyan: నిన్నటి మోదీ స్క్రిప్ట్ రాసిచ్చింది జగన్-పవన్ లే: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • జగన్, పవన్ ల విజ్ఞప్తులనే నిన్న మోదీ చదివారు
  • వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకటే
  • పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలకు పనికిరాడు

నిన్న లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చదివిన స్క్రిప్ట్ జగన్-పవన్ లు రాసిచ్చిందేనని టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్, పవన్ ల విజ్ఞప్తులనే లోక్ సభలో నిన్న మోదీ చదివి వినిపించారని, అవిశ్వాస తీర్మానంతో ఎవరు ఏ పార్టీకి అండగా ఉన్నారో ప్రజలకు అర్థమైందని, వైసీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు ఒకటేనని విమర్శించారు. ఆ మూడు పార్టీలు ఒకే భవనంలో కార్యాలయం పెట్టుకుంటే వారికి డబ్బు ఆదా అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం వీగిపోయిందని జగన్, పవన్ లు  నిన్న సంబరపడ్డారని, పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలకు పనికిరాడంటూ వెంకన్న మండిపడ్డారు.

More Telugu News