mamata benarji: టెంట్ కూడా సరిగా వేసుకోలేనోళ్లు ఈ దేశాన్ని నిర్మిస్తారట: మోదీపై మమతా బెనర్జీ వ్యంగ్యం

  • మోదీపై పశ్చిమబెంగాల్ సీఎం విమర్శలు 
  • కేంద్రంలో బీజేపీని గద్దె దించి తీరుతాం
  • ఈ విషయంలో మా రాష్ట్రం ముందుంటుంది

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో టెంట్ కూలి దాదాపు తొంభై మంది వరకు గాయపడ్డారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకున్న సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. టెంట్ కూడా సరిగా వేసుకోలేని వాళ్లు ఈ దేశాన్ని నిర్మిస్తారట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కోల్ కతాలో నిర్వహించిన అమరవీరుల దినోత్సవ ర్యాలీలో పాల్గొన్న మమత మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీని గద్దె దించి తీరుతామని, ఈ విషయంలో తమ రాష్ట్రం ముందుంటుందని అన్నారు. కాగా, 1993లో విక్టోరియా హౌస్ వద్ద జరిగిన కాల్పుల్లో పదమూడు మంది యూత్ కాంగ్రెస్ వర్కర్లు మృతి చెందిన ఘటనను నిరసిస్తూ ప్రతి ఏటా జులై 21న అమరవీరుల దినోత్సవంను తృణమూల్ కాంగ్రెస్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోల్ కతాలో ఈరోజు నిర్వహించిన ర్యాలీకి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

More Telugu News