kcr: అమ్మవారికి కేసీఆర్ సమర్పించిన చీర మాయం?

  • 2016 జూన్ 2న అమ్మవారికి చీరను సమర్పించిన కేసీఆర్
  • చీరను అపహరించిన ఉద్యోగి
  • ఆ స్థానంలో మరో చీరను పెట్టిన వైనం

కాళేశ్వరం ఆలయంలో అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించిన చీర మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆలయ ఉద్యోగే ఈ చోరీకి పాల్పడ్డాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో... అప్రమత్తమైన సదరు ఉద్యోగి వరంగల్ వెళ్లి, అలాంటిదే మరో చీర కొని, అపహరించిన చీర స్థానంలో పెట్టినట్టు సమాచారం. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్టు తెలుస్తోంది.

ఈ చోరీపై ఆలయ ఛైర్మన్, ఈవో స్పందిస్తూ, అమ్మవారికి ముఖ్యమంత్రి సమర్పించిన చీర మాయం కాలేదని చెప్పారు. 2016 జూన్ 2న అమ్మవారికి కేసీఆర్ ఈ చీరను కానుకగా సమర్పించారు. 

More Telugu News