bellamkonda: 'సాక్ష్యం' విడుదలకి అవి ఆటంకం కానున్నాయా?

  • పంచభూతాల నేపథ్యంలో సాగే కథ
  • కథలో భాగంగా పక్షులు .. జంతువులు
  • సెన్సార్ సభ్యుల అభ్యంతరం      

మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'సాక్ష్యం' రానుంది. దర్శకుడు శ్రీవాస్ గత చిత్రాలు కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించినవే. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'సాక్ష్యం' చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రావలసి వుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించినట్టుగా సమాచారం.

 'పంచభూతాల సాక్షిగా' అనే మాటను బేస్ చేసుకునే ఈ సినిమా కథ కొనసాగుతుంది. అందువలన ఈ సినిమాలో కొన్ని పక్షులను .. జంతువులను కూడా వాడారట. అయితే అందుకు సంబంధించిన అనుమతులను మాత్రం పొందలేదు. దాంతో సెన్సార్ చేయడానికి అధికారులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. జంతు సంరక్షణ చట్టాలు కఠినంగా వున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్ఓసీలు తీసుకురావడం కూడా అంత తేలిక కాదు. ఈ విషయం విడుదల తేదీపై ప్రభావం చూపుతుందేమోననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.  

More Telugu News