YSRCP: నేడు మీడియా ముందుకు వస్తున్నా: వైఎస్ జగన్

  • పాదయాత్ర ప్రారంభించే ముందు మీడియా సమావేశం
  • ఉదయం 8.30 గంటలకు ప్రెస్ మీట్
  • ట్విట్టర్ లో వెల్లడించిన జగన్

ఈ ఉదయం పాదయాత్రకు బయలుదేరే ముందు తాను మీడియాతో మాట్లాడనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న ఆయన, ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో గత రాత్రి ఓ ట్వీట్ పెట్టారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న పరిణామాలను తాను నిశితంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉదయం 8.30 గంటలకు మీడియాతో మాట్లాడతానని, తన అభిప్రాయాలను వెల్లడిస్తానని వైఎస్ జగన్ తెలియజేశారు.

More Telugu News