modi: మోదీ ప్రభుత్వంపై వీగిపోయిన అవిశ్వాసం!

  • ఓటింగ్ లో పాల్గొన్న మొత్తం సభ్యుల సంఖ్య 451
  • అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 
  • అనుకూలంగా 126 

మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, ఏపీకి అన్యాయంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఎన్డీఏ ప్రభుత్వం బలం నిరూపించుకుంది. గంటల కొద్దీ చర్చ జరిగింది. అనంతరం, అవిశ్వాస తీర్మానంపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఓటింగ్ లో పాల్గొన్న మొత్తం సభ్యుల సంఖ్య 451. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 మంది నిలవగా, అనుకూలంగా 126 మంది సభ్యులు మద్దతు తెలిపారు. కాగా, అవిశ్వాస తీర్మానంపై దాదాపు 12 గంటల పాటు చర్చ కొనసాగింది. అనంతరం లోక్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.


 

More Telugu News