modi: ఒకవైపు మోదీ ప్రసంగం.. మరోవైపు టీడీపీ ఎంపీల నినాదాలు!

  • టీడీపీ ఎంపీల నినాదాలతో మార్మోగిన లోక్ సభ
  • ‘మాకు న్యాయం చేయండి’అంటూ నినదించిన ఎంపీలు
  • కొద్ది సేపు ప్రసంగాన్ని ఆపిన మోదీ

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ  ప్రసంగం ప్రారంభించిన కొద్ది సేపటికే టీడీపీ ఎంపీల నినాదాలు మార్మోగాయి. దాంతో మోదీ కాసేపు ప్రసంగాన్ని ఆపారు. అయినప్పటికీ టీడీపీ ఎంపీలు ‘మాకు న్యాయం చేయండి.. మాకు న్యాయం చేయండి’ అనే నినాదాలను ఆపకుండా మరింత జోరుగా నినందించారు. దీంతో, ఒకవైపు టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తుండగానే.. మోదీ ప్రసంగం కొనసాగించారు.

‘ఇది ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష కాదు, కాంగ్రెస్ పార్టీకే ఒక పరీక్ష. ఒక్క మోదీని తొలగించేందుకు ఇంతమంది ఏకమవుతున్నారు. మాకు సంఖ్యా బలం ఉంది, 125 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఓటు బ్యాంకు కోసం కాదు. ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ నినాదంతో పని చేస్తున్నాం’ అని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

More Telugu News