srinivas: 'సాక్ష్యం'లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాక్ష్యం'
  • త్వరలో సెన్సార్ కి 
  • ఈ నెల 27వ తేదీన విడుదల

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ .. పూజా హెగ్డే జంటగా 'సాక్ష్యం' చిత్రం రూపొందింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోనుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని .. ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను వాయిస్ ఓవర్ తో కలపనున్నారు. వాయిస్ ఓవర్ తోనే ఒక సన్నివేశంలో నుంచి మరొక సన్నివేశంలోకి తీసుకెళ్లనున్నారు. ఈ రకంగా వాయిస్ ఓవర్ ప్రత్యేకతను సంతరించుకోవడంతో .. ప్రత్యేకమైన వాయిస్ ను కలిగిన సీనియర్ ఆర్టిస్ట్ తో ఆ వాయిస్ ఓవర్ చెప్పిస్తే బాగుంటుందని భావించారట. ప్రకాశ్ రాజ్ తో చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సంప్రదించడంతో ఆయన ఓకే చెప్పారట. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.   

More Telugu News