Ram Gopal Yadav: అవిశ్వాస తీర్మానంలో మీరెటు? అని ప్రశ్నించిన రిపోర్టర్.. బూతులు తిట్టిన ఎస్పీ ఎంపీ

  • మీరు రోజూ అదే ప్రశ్న అడుగుతారు
  • మేమేమైనా.. అంటూ బూతులు తిట్టిన ఎంపీ
  • అవాక్కైన రిపోర్టర్

నరేంద్రమోదీ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో మీ పార్టీ నిర్ణయం ఏంటన్న రిపోర్టర్ ప్రశ్నకు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రెచ్చిపోయారు. బూతులు తిడుతూ వెర్రెత్తిపోయారు. ‘‘అవిశ్వాస తీర్మానం చర్చకు రాబోతోంది కదా? మీ వ్యూహం ఏమిటి?’’ అని ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.

రిపోర్టర్ ప్రశ్న పూర్తికాకముందే ఎంపీ వీరంగమేశారు. ‘‘ఆప్ నహీ జాన్తే క్యా హై స్టాండ్ ఇస్ పే (మా నిర్ణయం ఏమిటనేది మీకు తెలియదా?) అని గద్దించారు. స్పందించిన రిపోర్టర్ మరోమారు ‘‘సర్ చెప్పండి ప్లీజ్’’ అని అడిగాడు. అంతే.. ఎంపీగారికి కోపం నషాళానికెక్కింది. ‘ఇడియట్’ అని అర్థం వచ్చేలా హిందీలో విరుచుకుపడ్డారు. ‘‘అరే రోజ్ పూచ్‌తే హై బాతా దీజియే, బిల్కుల్ **** సమజ్తే హో క్యా హమ్ లోగో కో (అరే ఈ ప్రశ్న మీరు రోజూ అడుగుతూ ఉంటారు. మేమేమైనా *** కనిపిస్తున్నామా?) అంటూ బూతులు తిట్టారు. దీంతో అవాక్కవడం రిపోర్టర్ వంతైంది.

More Telugu News