Vijayawada: యాంకర్లతో అశ్లీల నృత్యాలు... విజయవాడలో అరెస్టయిన వారిలో టీడీపీ నేతలు!

  • విజయవాడ ఆలివ్ ట్రీ హోటల్ పై దాడి
  • జాయింట్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు
  • పలువురు టీడీపీ నేతలు, వ్యాపారులు అరెస్ట్

విజయవాడ భవానీపురంలోని ఆలివ్ ట్రీ హోటల్ పై దాడి చేసి, అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న యువతులు సహా పదుల సంఖ్యలో పురుషులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. విజయవాడలో పట్టుబడిన తొలి ముజ్రా పార్టీగా పోలీసులు దీన్ని రిజిస్టర్ చేశారు. ఇక అరెస్టయిన వారిలో ఈవెంట్ యాంకర్లతో పాటు హైదరాబాద్, భీమవరం ప్రాంతాల నుంచి తెప్పించిన అమ్మాయిలు ఉన్నారని, వారిని వాసవ్య మహిళా మండలికి అప్పగించామని పోలీసులు వెల్లడించారు.

టీడీపీ ఎమ్మెల్యే అనుచరులైన 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొల్లూరు రామకృష్ణ, సామా చైతన్యలతో పాటు స్థానిక తెలుగు యువత నేతలు, వ్యాపారులు కూడా ఉన్నారు. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో దాడులు జరుగగా, అక్కడ పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారందరినీ ఒకే పోలీస్ స్టేషన్ లో ఉంచేందుకు వీలులేక భవానీపురం, వన్ టౌన్, ఇబ్రహీంపట్నం, గవర్నర్ పేట స్టేషన్లకు తీసుకెళ్లారు. ప్రతి బుధవారం ఇక్కడ ముజ్రా పార్టీ జరుగుతోందని, ప్రవేశానికి రూ. 5 వేలను రుసుముగా వసూలు చేస్తున్నారని, పార్టీ నిర్వాహకులు, పాల్గొన్న వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి, కోర్టు ముందు హాజరు పరిచినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News