Mahesh Babu: మహేశ్ బాబు 25వ మూవీ కోసం విలేజ్ సెట్!

  • 25వ మూవీ షూటింగులో మహేశ్ బాబు 
  • గ్రామీణ నేపథ్యంలోనూ సాగే కథ 
  • గోవాలోను ఒక షెడ్యూల్ ను ప్లాన్ చేశారు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు సినిమా రూపొందుతోంది .. మహేశ్ కి ఇది 25వ చిత్రం. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇటీవలే ఒక షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో పూర్తిచేసుకొచ్చారు. 'గోవా'లోను ఒక షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

అయితే హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం విలేజ్ సెట్ వేస్తున్నారనేది తాజా సమాచారం. గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. రైతుల సమస్యలకి సంబంధించి ఈ కథ కొనసాగుతుందనే టాక్ ఇంతకుముందే బయటికి వచ్చింది. అందుకు సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్ చేసి వుంటారనుకోవచ్చు. గోవా షెడ్యూల్ తరువాత ఇక్కడ షూటింగ్ చేస్తారా? ఇక్కడ షూటింగును పూర్తిచేసుకుని గోవా వెళతారా? అనేది చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   

More Telugu News