Chandrababu: ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలోనే చెప్పాం!: విజయసాయిరెడ్డి

  • మొదట అవిశ్వాసం పెట్టిందే వైసీపీ!
  • యూటర్న్ తీసుకున్నచంద్రబాబు ఇప్పుడు పెట్టారు 
  • మేం సభలో లేకపోయినా మద్దతు ఇస్తాం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిందే వైసీపీ అని... యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు, ఇప్పుడు అవిశ్వాసం పెట్టారని విజయసాయి మండిపడ్డారు.

ఏపీకి న్యాయం జరిగినందుకు ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని ఇంతకు ముందే తాము చెప్పామని... టీడీపీ దొంగల పార్టీ అయినా, ద్రోహుల పార్టీ అయినా కేంద్రానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని చెప్పారు. లోక్ సభలో తమ సభ్యులు లేకపోయినా, సంఘీభావం ప్రకటిస్తామని తెలిపారు.

More Telugu News