Telugudesam: టీడీపీ అవిశ్వాస తీర్మానం గొప్ప విషయమేమీ కాదు: టీఆర్ఎస్

  • అవిశ్వాసంపై చర్చలో పాల్గొంటామన్న ఎంపీ వినోద్
  • ఓటింగ్ పెడితే అందులో పాల్గొనాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం
  • హైకోర్టు విభజన జరగకపోవడానికి టీడీపీనే కారణం

ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి.. టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మద్దతు ప్రకటించలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గొప్ప విషయమేమీ కాదని చెప్పారు. అవిశ్వాసంపై ఓటింగ్ పెడితే... అందులో పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవిశ్వాసంపై జరిగే చర్చలో మాత్రం పాల్గొంటామని... విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీనే అని విమర్శించారు. 

More Telugu News