Sonia Gandhi: అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్న సోనియాగాంధీ.. వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు!

  • కాంగ్రెస్ ఎంపీలతో అత్యవసరం సమావేశం
  • అవిశ్వాసంపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • విపక్షాల మద్దతును కూడగట్టడంపై చర్చ

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై రేపు లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఈ చర్చను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహాలను, కేంద్రాన్ని ఎండగట్టే అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికితోడు, వివిధ పార్టీల మద్దతును కూడగట్టడం, విపక్షాలను ఒక్క తాటిపైకి తీసుకురావడం వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. దీంతో, ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

More Telugu News