America: అమెరికాలో ఆకాశంలో రెండు విమానాలు ఢీ.. ముగ్గురి మృతి

  • శిక్షణ విమానాలు ఢీ
  • మృతుల్లో 19 ఏళ్ల భారత యువతి
  • నాలుగో వ్యక్తి  కోసం గాలింపు

గగనతలంలో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ ఘటన. మియామీలోని డీన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్కూలుకు చెందిన విమానాలు పైలట్లకు శిక్షణ ఇస్తుండగా ప్రమాదం జరిగింది. పైకెగిరిన విమానాలు ఒక్కసారిగా ఢీకొన్నాయి. విమానాలు రెండూ పెద్ద శబ్దంతో ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, వారిలో 19 ఏళ్ల భారతీయ యువతి నిషా సెజ్వాల్ కూడా ఉంది. గల్లంతైన నాలుగో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలోనే ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్టు స్కూలు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు మియామీ పోలీసులు పేర్కొన్నారు. గల్లంతైన నాలుగో వ్యక్తి కోసం చేపట్టిన గాలింపు చర్యలను వాతావరణం సరిగా లేకపోవడం వల్ల నిలిపివేశారు.

More Telugu News