Kathi Mahesh: కత్తి మహేశ్ వ్యాఖ్యలపై విజయవాడలో కేసు నమోదు!

  • కత్తి వ్యాఖ్యలతో కులాలు, మతాల మధ్య గొడవలు
  • ఈ మేరకు విజయవాడలో ఓ వ్యక్తి ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా కత్తి మహేశ్ వ్యాఖ్యానిస్తున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో ఆయనపై విజయవాడలో పోలీస్ కేసు నమోదైంది. విజయ్ కుమార్ అనే వ్యక్తి సత్యనారాయణపురం పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మనస్పర్థలు సృష్టించేలా కత్తి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పలు సెక్షన్ల కింద కత్తి మహేశ్ పై కేసు నమోదు చేసినట్టు సమాచారం. కాగా, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కత్తి మహేశ్ హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే.

More Telugu News