jio: 'మాన్‌సూన్ హంగామా' ఆఫర్ తో మరో సంచలనానికి జియో సిద్ధం!

  • ఈ నెల 20న సాయంత్రం 5:01 గంటలకి ఆఫర్ ప్రారంభం
  • పాత ఫీచర్ ఫోన్ల మార్కెట్ పై జియోఫోన్ గురి
  • కేవ‌లం రూ.501 ప్రారంభ రుసుము చెల్లించి కొత్త జియోఫోన్ పొంద‌వ‌చ్చు

ఈ నెల 20న సాయంత్రం 5:01 గంటలకి ప్రారంభం కానున్న జియోఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫ‌ర్‌లో భాగంగా వినియోగ‌దారులు వారి పాత ఫీచ‌ర్ ఫోన్ (ఏ బ్రాండ్ అయినా సరే) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ (ప్ర‌స్తుతం ఉన్న మోడ‌ల్‌)ను కేవ‌లం రూ.501 ప్రారంభ రుసుము చెల్లించి పొంద‌వ‌చ్చు. ఇందుకోసం ముందుగా Jio.com వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత సంస్థ నుంచి వచ్చే మెసేజ్ ను బట్టి, ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్లి సమీపంలోని జియో స్టోర్లో ఫోన్ ను పొందవచ్చు. జియోఫోన్‌లోని యాప్ ఎకోసిస్ట‌మ్‌తో విశేష‌మైన విష‌య‌ ప‌రిజ్ఞానం, కొత్త అంశాలను తెలుసుకోవడంతో పాటు ఎంట‌ర్‌టైన్మెంట్‌ను త‌మ చేతివేళ్లతో స్పృశిస్తూ తెలుసుకోవ‌చ్చు. అలాగే ఫేస్‌బుక్‌, వాట్సాప్, యూట్యూబ్‌ సేవ‌ల‌ను కొత్త జియోఫోన్ లో పొందవచ్చు.

More Telugu News