Mahesh Babu: గోవా వెళ్లేందుకు రెడీ అవుతోన్న మహేశ్ బాబు

  • మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి మూవీ 
  • నిర్మాతలుగా అశ్వనీదత్ .. దిల్ రాజు 
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల       

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతోంది .. ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా. ఈ సినిమాలో మహేశ్ బాబు కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతుబిడ్డగాను రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. రైతు సమస్యలే ప్రధానంగా ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమాకి 'రాజసం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా టాక్ వుంది గానీ .. ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇటీవల డెహ్రాడూన్ లో షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ షెడ్యూల్ ను 'గోవా'లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.      

More Telugu News