Mahesh Babu: మహేశ్ బాబుతో మరోసారి జోడీకడుతోన్న రకుల్!

  • షూటింగు దశలో మహేశ్ 25వ మూవీ 
  • నెక్స్ట్ మూవీ దర్శకుడిగా సుకుమార్ 
  • నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్

మహేశ్ బాబుతో 'స్పైడర్' సినిమా చేసిన దగ్గర నుంచి రకుల్ తమిళ .. హిందీ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆ తరువాత ఆమె ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయకపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ మహేశ్ బాబు మూవీతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఒక వైపున ఈ సినిమా షూటింగు కొనసాగుతూ ఉండగానే, మరో వైపున ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎపిక చేసినట్టుగా తెలుస్తోంది.   

More Telugu News