ramaprabha: శ్రీదేవిని వాళ్లమ్మ ఎవరితోనూ కలవనిచ్చేది కాదు: రమాప్రభ

  • శ్రీదేవి చిన్నపిల్లగాను తెలుసు 
  • నా కళ్ల ముందే హీరోయిన్ అయింది 
  • ఒక పరిథిలో శ్రీదేవి ఉండిపోయింది

తాజాగా' ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రమాప్రభ తన కెరియర్ కి సంబంధించిన విశేషాలను .. ఇతర నటీనటులతో గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంలో 'శ్రీదేవిగారితో చాలా సినిమాల్లో నటించారు గదా .. ఆమె చనిపోయిందని తెలియగానే మీకేమనిపించింది?' అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు రమాప్రభ స్పందిస్తూ .. "శ్రీదేవి చిన్నపిల్లగా వున్నప్పుడు కూడా తనతో కలిసి నేను నటించాను. ఎక్కువ సినిమాలు చేయడం వలన తనకి నేనంటే ఇష్టం. కానీ నాతో ఎటాచ్ మెంట్ ఉండకూడదనే ఉద్దేశంతో శ్రీదేవిని వాళ్లమ్మ నాకు దూరంగా వుంచేది.

 శ్రీదేవి హీరోయిన్ అయిన తరువాత కూడా వాళ్లమ్మ గారు ఎవరితోనూ కలవనిచ్చేది కాదు. అందుకు కారణమేమిటనేది కూడా నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి శ్రీదేవికి సంతోషం తెలియదు .. స్వతంత్రం లేదు. ఎప్పుడూ అందంగా డ్రెస్ చేసుకుని నటించడం తప్ప, వేరే లైఫ్ ఆ అమ్మాయికి ఎంత మాత్రం తెలియదు. పెళ్లి అయిన తరువాత కూడా శ్రీదేవి అదే పరిథిలో వుండిపోయింది. అలాంటి శ్రీదేని చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నిజానికి అప్పటికి చాలాకాలం క్రితం నుంచి ఆమె జీవం లేని మనిషిలా నాకు అనిపించింది" అని చెప్పుకొచ్చారు.    

More Telugu News