ntr: బ్రిటిష్ కాలం నాటి కథా నేపథ్యంతోనే రాజమౌళి మూవీ?

  • ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి 
  • 300 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం 
  • నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయనున్నాడు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ లు బాక్సర్లుగా కనిపించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని చరణ్ స్పష్టం చేశాడు. దాంతో కథా నేపథ్యం ఏమైవుంటుందనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వస్తోంది.

ఈ కథ బ్రిటిష్ కాలానికి సంబంధించిన నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. బ్రిటిష్ కాలానికి సంబంధించిన సామాజిక వాతావరణం , ఆ కాలం నాటి బైకులు .. కార్లు ఈ కథలో కనిపిస్తాయని చెబుతున్నారు. స్వాతంత్ర్య పోరాట వాసనలు ఈ సినిమాలో కనిపిస్తాయని అంటున్నారు. ఇందుకోసం భారీ సెట్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ సినిమాకి 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఒక కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. నవంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు.    

More Telugu News