nikhil: భారీ రేటుకు 'ముద్ర' శాటిలైట్ రైట్స్

  • నిఖిల్ హీరోగా రూపొందుతోన్న 'ముద్ర'
  • కథానాయికగా లావణ్య త్రిపాఠి 
  • త్వరలో టీజర్ విడుదల     

నిఖిల్ ఇంతకుముందు రీమేక్ గా 'కిరాక్ పార్టీ' చేయగా అది అంతగా ఆడలేదు. అయినా ఆయన 'కనిథన్' అనే తమిళ సినిమా రీమేక్ లో చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి 'ముద్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లోని ఒక టీవీ స్టూడియోలో జరుగుతోంది. నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. 

ఇంతవరకూ 50 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిఖిల్ .. అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. అందువలన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి మంచి ధరే పలికింది. తెలుగు .. హిందీ శాటిలైట్ రైట్స్ ను అయిదున్నర కోట్లకు అమ్మినట్టుగా సమాచారం. 'ఠాగూర్' మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ ను విడుదల చేయనున్నారు.     

More Telugu News