trisha: త్రిష ‘మోహిని’ ట్రైలర్ విడుదల

  • ఈ నెల 27న విడుదల కానున్న‘మోహిని’
  • ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్
  • మహిళలకు నచ్చుతుందంటున్న దర్శకుడు 

దక్షిణాది నటి త్రిష కీలక పాత్ర పోషిస్తున్న తమిళ చిత్రం ‘మోహిని’. ఆర్. మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా ‘మోహిని’ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది.

తెలుగులో కూడా ‘మోహిని’ పేరుతోనే విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది. ‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం’ అంటూ ఈ ట్రైలర్  ప్రారంభమైంది. కాగా, దర్శకుడు మాదేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఒక సామాజిక సమస్యను ప్రస్తావించామని, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అది ఉంటుందని, ముఖ్యంగా మహిళలకు ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుందని అన్నారు.

More Telugu News