sudheer babu: రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'నన్ను దోచుకుందువటే'

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'నన్ను దోచుకుందువటే'
  • సుధీర్ బాబు సరసన నాభా నటేశ్ 
  • సెప్టెంబర్ 13వ తేదీన విడుదల  

కొత్తదనం కలిగిన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ సుధీర్ బాబు విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన 'నన్ను దోచుకుందువటే' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. నాభా నటేశ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ మంచి మార్కులను కొట్టేసింది.

యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా సుధీర్ బాబు సొంత బ్యానర్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా .. నిర్మాతగానూ ఆయన ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.     

More Telugu News