karthikeya: 'ఆర్ ఎక్స్ 100' కథ ముందుగా సుధీర్ బాబు దగ్గరికి వచ్చిందట!

  • 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడిగా భూపతి రాజా 
  • కథ అలా కార్తికేయ దగ్గరకొచ్చింది 
  • భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టింది  

హీరోలైనా .. హీరోయిన్లైనా కొన్ని కారణాల వలన కొన్ని సినిమాలను వదులుకుంటూ వుంటారు. అలా తాము వదులుకున్న సినిమాలు భారీ విజయాలను సాధించినప్పుడు వాళ్లు 'అరెరే .. ' అనుకోవడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే సుధీర్ బాబు ఉన్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం 'ఆర్ ఎక్స్ 100' సినిమా ఏ స్థాయి వసూళ్లను కొల్లగొడుతుందనేది తెలిసిందే.

ఈ కథను పట్టుకుని దర్శకుడు అజయ్ భూపతి ముందుగా సుధీర్ బాబు దగ్గరికే వచ్చాడట. మూడు నాలుగు నెలలు గడిచినా సుధీర్ బాబు పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో, కథ కార్తికేయ దగ్గరికి వచ్చిందని సమాచారం. సుధీర్ బాబు ఈ సినిమాను చేసి వుంటే 'సమ్మోహనం' వెంటనే మరో హిట్ పడి ఉండేది. ఇక తన బ్యానర్లో చేసి వుంటే నిర్మాతగాను ఆయనకి హిట్ పడేదని చెప్పుకుంటున్నారు. నిజంగానే ఈ కథ సుధీర్ బాబుకి సెట్ అయ్యేదిగా అనిపిస్తోంది కదూ.    

More Telugu News