giddi eswari: వదినతో గొడవ.. తోపులాటలో కిందపడ్డ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.. వీడియో చూడండి

  • వదిన భూమిని కొనుగోలు చేసిన గిడ్డి ఈశ్వరి
  • నిర్మాణం పనులు చేపట్టే విషయంలో గొడవ
  • ఇద్దరి మధ్య తోపులాట

విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆమె వదిన విజయలక్ష్మిలు గొడవపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, తన స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదనకు చెందిన భూమిని రూ. 2 లక్షలకు ఈశ్వరి కొనుగోలు చేశారు. ఆ భూమిలో ఆమె ఇంటి నిర్మాణం పనులను చేపట్టారు. ధాన్యం నిల్వ కోసం గదిని నిర్మించే క్రమంలో ఇద్దరి మధ్య నిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో, ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో, ఈశ్వరి కింద పడిపోయారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఈ విషయంపై ఈశ్వరిని మీడియా ప్రశ్నించగా... ఇది తమ కుటుంబ వ్యవహారమని, దీన్ని సోషల్ మీడియాలో పెట్టడం తగదని చెప్పారు.

More Telugu News