Balakrishna: 'ఎన్టీఆర్'లో కీర్తి సురేశ్ ఎంపిక ఖరారైనట్టే!

  • క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్'
  • భారీ తారాగణమే ప్రత్యేక ఆకర్షణ 
  • ప్రత్యేకగీతంలో రకుల్ ప్రీత్ సింగ్    

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ .. విద్యాబాలన్ .. రానా .. ప్రకాశ్ రాజ్ .. మోహన్ బాబు .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ నట ప్రస్థానంలో సావిత్రి పాత్రను టచ్ చేయకుండా ఉండటం కష్టం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందువలన 'ఎన్టీఆర్' బయోపిక్ లో సావిత్రి పాత్ర కూడా కనిపించనుంది.

'మహానటి' లో సావిత్రిగా నటించిన కీర్తి సురేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఇప్పుడు సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ను కాకుండా మరో కథానాయికను ప్రేక్షకులు ఊహించుకోవడం కష్టం. అందువలన ఆమెను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఎంపిక ఖరారైపోయిందనేది సినీవర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో రకుల్ కనిపించనుందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.   

More Telugu News