Jammu And Kashmir: జలపాతం వద్ద పర్యాటకుల జలకాలాటలు... బండరాళ్లు పడి ఏడుగురి మృతి!

  • సియర్ బాబా జలపాతం వద్ద ఘటన
  • తీవ్రంగా గాయపడిన 30 మంది
  • పలువురి పరిస్థితి విషమం

జమ్ము కశ్మీర్‌ లోని రియాసి జిల్లాలో ఉన్న సుందరమైన సియర్‌ బాబా జలపాతం వద్ద ఆనందంగా స్నానాలు చేస్తున్న యువ పర్యాటకులపై పైనుంచి ఓ భారీ బండరాయి పడటంతో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 30 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం సెలవును సరదాగా గడిపేందుకు వీరంతా రాగా, సాయంత్రం సమయంలో బురదతో కొట్టుకొచ్చిన భారీ రాయి కింద పడింది.

ఆ సమయంలో జలపాతంలో సుమారు 100 మందికి పైగానే ఉన్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జలపాతం 100 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ దూరం నుంచి చూసేవారికి మంచు కురుస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది.

More Telugu News