vijay deverakonda: విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న ‘దివీస్’

  • విజయ్ దేవరకొండ రౌడీస్ క్లబ్ ప్రారంభం
  • ఇదే వేదికగా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కొనుగోలు
  • రూ.25 లక్షలు చెల్లించి ఆ అవార్డును తీసుకున్న ‘దివీస్’ 

‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ ఆ అవార్డును వేలం వేసి సీఎం రిలీప్ ఫండ్ కు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ అవార్డును వేలం వేసే పనిలేకుండా దివీస్ లేబొరేటరీస్ సంస్థ సొంతం చేసుకుంది. ‘దివీస్’ అధినేత కిరణ్ సతీమణి శకుంతల ఈ అవార్డుకు రూ.25 లక్షలు చెల్లించి సొంతం చేేసుకున్నారు.

తన అభిమానుల కోసం సొంత దుస్తుల బ్రాండ్ ‘రౌడీ క్లబ్’ను విజయ్ దేవరకొండ ఈరోజు ప్రారంభించారు. ఇదే వేదికపై విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డును శకుంతల కొనుగోలు చేశారు. అయితే, ఆ అవార్డును కొనుగోలు చేసిన శకుంతల, తిరిగి ఆ అవార్డును విజయ్ దేవరకొండకే ఆమె అందివ్వబోగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు.

More Telugu News