upsc: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

  • www.upsc.gov.in లో ఫలితాలు
  • పరీక్ష రాసిన 3,00,000 మంది అభ్యర్థులు
  • 13,336 మంది మెయిన్స్‌కు ఎంపిక

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఈరోజు సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసింది. తమ వెబ్‌సైట్‌ www.upsc.gov.in లో అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను దేశంలోని 73 కేంద్రాల్లో జూన్‌ 3, 2018న నిర్వహించారు. ఈ పరీక్షను దాదాపు 3,00,000 మంది అభ్యర్థులు రాశారు.

ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారు యూపీఎస్సీ ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే మెయిన్‌ పరీక్ష రాసేందుకు అర్హులు. దేశ వ్యాప్తంగా 13,336 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది క్వాలిఫై అయ్యారు. 

More Telugu News