kiran kumarreddy: కిరణ్‌ కుమార్‌రెడ్డి టీడీపీలోకి వస్తారని మేమనలేదు: మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వివరణ

  • కిశోర్‌ కుమార్‌రెడ్డి చంద్రబాబుపై నమ్మకంతో టీడీపీలో చేరారు
  • వచ్చే ఎన్నికల్లో కిశోర్‌ టీడీపీ తరఫునే పోటీ చేస్తారు
  • కాంగ్రెస్‌తో టీడీపీ జోడీ కట్టే ప్రసక్తేలేదు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌ కుమార్‌రెడ్డి టీడీపీలో చేరిన నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరతారంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పందిస్తూ, కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వస్తారని తాము ఎన్నడూ చెప్పలేదని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే కిశోర్‌ కుమార్‌రెడ్డి టీడీపీలో చేరారని అన్నారు.

చిత్తూరులో వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో కిశోర్‌ టీడీపీ తరఫునే పోటీ చేస్తారని అన్నారు. అలాగే, బీజేపీ, వైసీపీ ఒక్కటైనందునే కాంగ్రెస్‌, టీడీపీ కలుస్తాయనుకోవడం సరికాదని అన్నారు.

More Telugu News