Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'పడి పడి లేచె మనసు' కోల్ కతా షూటింగ్ పూర్తి 
  • రామోజీ ఫిలిం సిటీలో 'సాహో' భారీ షెడ్యూల్ 
  • మళ్లీ అమెరికా వెళుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' 

*  శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'పడి పడి లేచె మనసు' చిత్రం కోల్ కతా షెడ్యూల్ ముగిసింది. అక్కడ నిర్వహించిన భారీ షెడ్యూల్ లో చాలా భాగం షూటింగ్ చేశారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న రిలీజ్ చేస్తారు.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సాహో' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. సుమారు ఏభై రోజుల పాటు ఈ షెడ్యూలును నిర్వహిస్తారు. దీంతో టాకీ దాదాపు పూర్తవుతుందని అంటున్నారు.
*  రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం కోసం తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఓ పాటను చిత్రీకరించారు. ఈ నెల 20 నుంచి తిరిగి అమెరికాలో షూటింగ్ నిర్వహిస్తారు. ఆ షెడ్యూలు నలభై రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తోంది.

More Telugu News