Vijayawada: ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరదనీరు.. గేట్లు ఎత్తనున్న అధికారులు

  • ఈరోజు అర్ధరాత్రి తర్వాత బ్యారేజ్ గేట్లు ఎత్తనున్న అధికారులు
  • 4,500 నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం
  • దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు అర్ధరాత్రి తర్వాత బ్యారేజ్ గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న కృష్ణా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, 4,500 నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని మునేరు, పాలేరు నుంచి కృష్ణా నదికి చేరే వరద నీటి ప్రవాహం పెరిగింది.

More Telugu News