Karnataka: రెండు ఇండిగో విమానాలకు తప్పిన ప్రమాదం

  • కోయంబత్తూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతోన్న ఓ విమానం
  • బెంగళూరు నుంచి కోచి మార్గంలో మరో విమానం
  • మధ్య దూరం నిలువుగా 200 అడుగుల దూరంలో విమానాలు

కోయంబత్తూర్‌ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు నుంచి కోచి మార్గాల్లో నడిచే రెండు ఇండిగో విమానాలకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో ఆ రెండు విమానాలు అత్యంత చేరువగా వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రమాద నివారణ వ్యవస్థ వాటి పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది.

ఆ సమయంలో ఇరు విమానాల మధ్య కేవలం 200 అడుగుల ఎత్తు మాత్రమే ఉందని తెలిసింది. ఈ ఘటనపై విమాన ప్రమాద విచారణ బోర్డు (ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టింది. ఈ రెండు విమానాల్లో కలిపి మొత్తం 330 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. 

More Telugu News