airplane: ప్రయాణికులకు చుక్కలు చూపించిన జెట్‌ ఎయిర్‌వేస్‌!

  • ఢిల్లీ నుంచి భోపాల్‌ వెళ్లాల్సిన 9 డబ్ల్యూ 927 విమానం
  • ప్రయాణికులు ఎక్కిన కాసేపటికే సాంకేతిక లోపం
  • మరో విమానం ఎక్కించిన సిబ్బంది
  • ఆ విమానం కూడా మొరాయించిన వైనం

ఢిల్లీ నుంచి భోపాల్‌ వెళ్లాల్సిన ప్రయాణికులకు జెట్ ఎయిర్ వేస్ ఈ రోజు చుక్కలు చూపించింది. భోపాల్ కు వెళ్లాల్సిన 9 డబ్ల్యూ 927 నంబర్‌ జెట్‌ఎయిర్‌వేస్‌ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంతో, తిరిగి ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను దించేసింది. కొన్ని గంటల అనంతరం ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించారు. అయితే, ఆ విమానంలోని సిబ్బంది డ్యూటీ టైమింగ్స్‌ ముగిసిపోవడంతో విమానాన్ని నడిపేందుకు నిరాకరించారు.

దీంతో ఆ విమానం కూడా దిగాల్సి వచ్చింది. మరో విమానంలో వారిని పంపాలని అనుకోగా ఆ విమానం కూడా మరమ్మతులకు గురయింది. దీంతో ప్రయాణికులు నిరసనకు దిగారు. వారికి నచ్చజెప్పిన ఆ విమానయాన సంస్థ ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌ లాంజి‌లోని హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేసింది. వారిని భోపాల్ పంపేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తామని సంస్థ తెలిపింది.

More Telugu News