rajendraprasad: విలన్ గా చేసిన మూవీ ఫ్లాప్ .. నిర్మాతగా 'రాంబంటు' నష్టాలు తెచ్చిపెట్టింది: రాజేంద్ర ప్రసాద్

  • విలన్ గా 'మిస్టర్ వి' చేశాను 
  • నన్ను అలా చూడలేకపోయారు 
  • 'రాంబంటు'ను టీవీల్లో బాగా చూశారు

హాస్య కథానాయకుడిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుతం తన వయసుకి తగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఈటీవీలో వచ్చే 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని విషయాలను ప్రస్తావించారు.

"నాకు తెలిసి ఒకే ఒక సినిమాలో విలన్ గా చేశాను .. అదే 'మిస్టర్ వి'. నవల ఆధారంగా చేసిన ఈ సినిమాలో ఇంటర్వెల్ సమయానికి 'మిస్టర్ వి' నేనే అనే విషయం తెలుస్తుంది. నన్ను అలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవడం వలన ఆ సినిమా ఆడలేదు. ఇక నిర్మాతగా 'రాంబంటు' సినిమాను నిర్మించాను. ఆ సినిమా ఊహించనంత నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ సినిమా విషయంలో మొదటి నుంచి కొన్ని తప్పులు జరుగుతూ రావడం వలన పరాజయం పాలైంది. గమ్మత్తు ఏంటంటే .. పరాజయం పాలైన ఆ సినిమా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News