nitin gadkari: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర సర్కారులకు చిత్తశుద్ధి ఉందా?: బొత్స

  • పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యం జరుగుతోంది
  • పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కనబెట్టారు
  • డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయి?
  • ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరిగాయి

పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యం జరుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఆ ప్రాజెక్టు పనులను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పరిశీలించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ హైదరాబాద్ లోని తమ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కనబెట్టారని, ఆ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర సర్కారులకు చిత్తశుద్ధి ఉందా? అని నిలదీశారు. డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు జరిగిన విషయం నితిన్‌ గడ్కరీ పర్యటనలో బహిర్గతమైందని ఆయన అన్నారు.  

More Telugu News