nara rohith: ఈ దర్శకుడు నన్ను టార్చర్ పెట్టేశాడు: హీరో శ్రీవిష్ణు

  • ఇంద్రసేన కథ చెప్పాడు 
  • ఇంతవరకూ ఈ తరహా కథ రాలేదు 
  • ఆడియన్స్ కి నచ్చేస్తుంది

'వీర భోగ వసంత రాయలు' .. ఈ టైటిల్ వినగానే చాలా వైవిధ్యంగా అనిపిస్తోంది కదూ .. ఈ టైటిల్ ఈ సినిమాకి సరిగ్గా సరిపోతుందని హీరో శ్రీవిష్ణు చెబుతున్నాడు. నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రియతో పాటు శ్రీవిష్ణు కూడా ఇందులో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "దర్శకుడు ఇంద్రసేన మొదటిసారిగా ఈ కథ నాకు చెప్పినప్పుడు ఏమీ అర్థం కాలేదు .. రెండు రోజుల పాటు ఆలోచనలో పడిపోయాను.

ముందుగా ప్రేక్షకులకు కూడా అలాగే అనిపిస్తుంది .. ఆ తరువాత అసలు విషయం అర్థమవుతూ వెళుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అనూహ్యమైన మలుపులతో పిచ్చెక్కించే కథ ఇది. ఇంతవరకూ ఈ తరహా కథ తెరను తాకలేదని చెప్పగలను. మళ్లీ ఇలాంటి సినిమాను చూడాలని ఆడియన్స్ అనుకుంటే మళ్లీ ఇంద్రసేన మాత్రమే తీయవలసి ఉంటుంది. ఇంతవరకూ సినిమాల్లో చేస్తూ నేను పడిన కష్టం వేరు .. ఈ సినిమా కోసం పడిన కష్టం వేరు. నిజం చెప్పొద్దూ ఈ సినిమా కోసం నన్ను ఇంద్రసేన టార్చర్ పెట్టేశాడు" అంటూ నవ్వేశాడు.  

More Telugu News