vijay mallya: శిలువపై నన్ను ఉరి తీస్తే.. ఓట్లు రాలతాయనేది ఎన్డీయే ఆలోచన: విజయ్ మాల్యా

  • భారత ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం నన్ను వెంటాడుతోంది
  • బకాయిలు చెల్లించడానికి రూ. 13,900 కోట్ల ఆస్తులు కుదువపెట్టా
  • త్వరలోనే బ్యాంకుల లావాదేవీలన్నీ పూర్తి చేస్తా

రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం తనను వాడుకోవాలని ఎన్డీయే చూస్తోందని... తనను భారత్ కు రప్పించి, శిలువపై ఉరి తీస్తే ఓట్లు రాలతాయని భావిస్తోందని లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అన్నారు. రాజకీయ అవసరాల కోసం భారత ప్రభుత్వం తనను వెంటాడుతోందని చెప్పారు. విజయ్ మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం... ఆయనను తమకు అప్పగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ లో ఉన్న మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కూడా కోరుతోంది.

ఈ నేపథ్యంలో మాల్యా మాట్లాడుతూ, ఎప్పుడో తన తండ్రి తనకు రాసిచ్చిన ఆస్తులను కూడా తీసేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ తీసుకుని తమరు తన వద్దకు రావడమెందుకని... తానే వచ్చి ఆస్తులను అందజేస్తానని బ్రిటీష్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు తాను చెప్పానని తెలిపారు. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం.... రూ. 13,900 కోట్ల విలువైన తన ఆస్తులను కుదువపెట్టానని... బ్యాంకులతో ఉన్న లావాదేవీలన్నింటినీ పూర్తి చేస్తానని చెప్పారు. లండన్ శివార్లలో నాలుగు ఇళ్లు మాల్యా పిల్లల పేరిట ఉన్నాయి. దీనికి తోడు, అత్యంత విలాసవంతమైన ఓ భవనాన్ని తల్లి పేరిట పెట్టారు. ఇదంతా వ్యూహాత్మకంగానే చేసినట్టు భావిస్తున్నారు. 

More Telugu News