Anam Ramanarayana Reddy: చౌరస్తాలో ఆనం రామనారాయణ రెడ్డి.. ఎవరు పిలిస్తే ఆ పార్టీలోకి!

  • పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోలేకపోతున్న ఆనం
  • ముఖ్య అనుచరులతో సమావేశం
  • ఆగస్టులో నిర్ణయాన్ని ప్రకటిస్తానన్న మాజీ మంత్రి

టీడీపీలో తాను ఇమడలేకపోతున్నానని, అందుకే పార్టీకి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్న నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో సోమవారం ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. అయినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారు.

ఈ సమావేశంలో అనుచరులు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నామని, ఏ పార్టీ నుంచి పిలుపు వస్తే ఆ పార్టీలో చేరాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఆగస్టులో నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకు ఈ విషయం గురించి ఆలోచించవద్దని ఆనం తన అనుచరులతో పేర్కొన్నారు. నిజానికి ఆనం వైసీపీలో చేరుతారని భావించారు. అయితే, ఎందుకనో ఆ తర్వాత మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడలేదు.  

More Telugu News