KTR: దివిటిపల్లెలో ఐటీ కారిడార్‌ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

  • మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్
  • 400 ఎకరాలలో దివిటిపల్లె - ఎదిర గ్రామ శివార్లలో ఐటీ కారిడార్‌
  • కేటీఆర్ వెంట పలువురు ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. 400 ఎకరాలలో దివిటిపల్లె - ఎదిర గ్రామ శివార్లలో ఐటీ కారిడార్‌ నిర్మాణం, జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, క్లాక్‌ టవర్, ఆర్‌అండ్‌బీ, తెలంగాణ చౌరస్తాల వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ లో మంత్రి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి కేటీఆర్ సరదాగా కాసేపు బోట్ లో విహరించారు.  

More Telugu News