England: రెండో టీ20లో టీమిండియా ఓటమి.. ఫలితం మూడో టీ 20కి షిఫ్ట్!

  • 1-1తో సిరీస్ సమం
  • కీలకం కానున్న చివరి టీ20
  • అలెక్స్ హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా  శుక్రవారం కార్డిఫ్‌లో భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ‌తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన లోకేశ్ రాహుల్ ఈ మ్యాచ్‌లో ఆరు పరుగులకే పెవిలియన్ చేరాడు. కోహ్లీ 47, సురేశ్ రైనా 27, ధోనీ 32 పరుగులు చేశారు.

అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో ఆదివారం బ్రిస్టల్‌లో జరగనున్న చివరి టీ20 కీలకంగా మారనుంది. కాగా, జట్టును విజయ తీరాలకు చేర్చిన అలెక్స్ హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News