Pakistan: పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్ల జైలు శిక్ష ఖరారు!

  • అవినీతి కేసులో శిక్ష ఖరారు
  • షరీఫ్‌ కుమార్తె మార్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
  • అల్లుడికి ఒక ఏడాది జైలు శిక్ష
  • ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

అవినీతికి పాల్పడ్డ కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మార్యమ్‌, అల్లుడు కెప్టెన్‌ సఫ్దర్‌లకు జైలు శిక్ష పడింది. ఈ కేసులో దోషులు నవాజ్‌ షరీఫ్‌కి 10 ఏళ్ల జైలు శిక్ష, 8 మిలియన్‌ పౌండ్ల జరిమానా విధించగా, ఆయన కూతురు మార్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, 2 మిలియన్‌ పౌండ్ల జరిమానా, సర్దార్‌కు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

పాకిస్థానీయులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న ఈ కేసు శిక్ష ఖరారు తీర్పు ఈరోజు వెలువడుతోన్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పనామా పేపర్లలో నవాజ్‌ షరీఫ్‌ పేరు ఉండడంతో పాక్‌ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం విదితమే.

More Telugu News