bumra: ఇంగ్లండ్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శార్దూల్‌ ఠాకూర్‌ ఎంపిక

  • ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా
  • వన్డేల్లో బుమ్రా స్థానంలో శార్దూల్‌
  • గాయం నుంచి ఇంకా కోలుకోని బుమ్రా
  • ఈ నెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి టీ20 మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి రెండో టీ20 మ్యాచ్‌ ఆడనుంది. వచ్చే ఆదివారం చివరి టీ20 ఆడుతుంది. అనంతరం ఈ నెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే, ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో టీమిండియా పేసర్‌ జస్పిత్‌ బుమ్రా ఎడమచేతి బొటనవేలికి అయిన గాయం ఇంకా మానకపోవడంతో ఆయన ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ వన్డేలకి కూడా దూరమవుతున్నాడు. ఆయన స్థానంలో వన్డే సిరీస్‌కు శార్దూల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఈరోజు ప్రకటించింది.   

More Telugu News