kalyan dev: కథ వినగానే చిరంజీవిగారు థ్రిల్ ఫీలయ్యారు: కల్యాణ్ దేవ్

  • నటనలో శిక్షణ పూర్తిచేశాను  
  • అదే సమయంలో రాకేశ్ శశి కథ వినిపించాడు 
  • షూటింగ్ పూర్తయ్యాక టైటిల్ ఖరారు చేశాం  

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా కల్యాణ్ దేవ్ తెరపైకి వస్తున్నాడు. ఆయన మొదటి సినిమాగా రూపొందిన 'విజేత' .. ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాను గురించిన విషయాలను ప్రస్తావించాడు. "వైజాగ్ లో సత్యానంద్ గారి దగ్గర నేను నటనలో శిక్షణ పొందాను. అక్కడి నుంచి వచ్చేసిన తరువాత ఎలా నా టాలెంట్ ను నిరూపించుకోవాలా అని ఆలోచిస్తూ వున్న సమయంలో, కొత్త హీరోతో సినిమా చేయడానికి రాకేశ్ శశి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

అప్పుడు ఆయనకి  సత్యానంద్ గారు నా పేరు చెప్పారట. రాకేశ్ శశి వచ్చి నాకు కథ వినిపించాడు .. నాకు నచ్చడంతో చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లాను. కథ విని ఆయన థ్రిల్ ఫీలయ్యారు .. అలా ఈ ప్రాజెక్టు ముందుకు కదిలింది..  ఈ సినిమాకి ముందుగా వేరే టైటిల్ అనుకున్నాము. షూటింగు మొత్తం పూర్తయిన తరువాత, 'విజేత' అయితే కథకు కరెక్టుగా సరిపోతుందని దర్శక నిర్మాతలకి అనిపించింది. వాళ్ల అభిప్రాయంతో మిగతావాళ్లంతా ఏకీభవించారు. అలా ఈ సినిమాకి 'విజేత' టైటిల్ సెట్ అయింది" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News