Mahesh Babu: మహేశ్ బాబు కోసం కథ రెడీ చేసిన సురేందర్ రెడ్డి

  • 'సైరా' షూటింగుతో బిజీగా సురేందర్ రెడ్డి 
  • ఆ తరువాత సినిమా మహేశ్ బాబుతో
  • గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'అతిథి'      

ప్రస్తుతం సురేందర్ రెడ్డి .. చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన బన్నీతో గానీ .. మహేశ్ బాబుతో గాని చేయవచ్చనే టాక్ వినిపించింది. ఈ ఇద్దరిలో మహేశ్ బాబుతోనే ఆయన ముందుగా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తాజా సమాచారం. మహేశ్ బాబు కోసం ఆయన విభిన్నమైన ఒక కథను సిద్ధం చేశాడట.

ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు. డెహ్రాడూన్ లో ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత మహేశ్ బాబును కలిసి కథను వినిపించే పనిలో సురేందర్ రెడ్డి వున్నాడని అంటున్నారు. గతంలో సురేందర్ రెడ్డి .. మహేశ్ బాబు కాంబినేషన్లో 'అతిథి' సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా మహేశ్ అభిమానులకు నిరాశనే మిగిల్చింది. అందువలన ఈ సారి మహేశ్ ఫ్యాన్స్ మెచ్చేలా కథను రెడీ చేసుకున్నాడట. మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే .. సురేందర్ రెడ్డి ఆ తరువాత సినిమాను బన్నీతో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

More Telugu News