venkatesh: దిల్ రాజు నిర్మాతగా మల్టీ స్టారర్ .. షూటింగ్ మొదలు

  • అనిల్ రావిపూడి దర్శకుడిగా 'ఎఫ్ 2' 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు .. 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' అనేది ట్యాగ్ లైన్. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ రోజు ఉదయం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ నెల 21వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగనుంది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేశారు. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమాతోను సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.   

More Telugu News