Emirates: ప్రయాణికుల ఒత్తిడితో దిగొచ్చిన ఎమిరేట్స్.. హిందూ భోజనానికి ఓకే!

  • ‌ఎయిర్‌లైన్స్ మెను నుంచి హిందూ భోజనం తొలగింపు
  • దుమ్మెత్తి పోసిన నెటిజన్లు
  • నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఎమిరేట్స్

తమ మెను నుంచి హిందూ భోజనాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల ఒత్తిడికి తలొగ్గింది. మెనులో తిరిగి హిందూ భోజనాన్ని చేరుస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమిరేట్స్ నిర్ణయాన్ని దేశంలోని సోషల్ మీడియా యూజర్లు తప్పుబట్టారు. ఎమిరేట్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. హిందూ భోజనాన్ని తిరిగి మెనూలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యం యూటర్న్ తీసుకుంది.

భారత్‌లో అతిపెద్ద విదేశీ విమానయాన సంస్థ అయిన ఎమిరేట్స్ అంతకుముందు విమాన మెనులోంచి హిందూ భోజనాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. దీంతో హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకున్నట్టు బుధవారం సాయంత్రం ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

More Telugu News