anupama: 'రామలక్ష్మి' పాత్ర నేను చేయాల్సింది .. సమంత అద్భుతంగా చేసింది: అనుపమ పరమేశ్వరన్

  • రామలక్ష్మి పాత్రకు సమంత న్యాయం చేసింది 
  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ జీవించింది 
  • 'సమ్మోహనం'లో అదితీ రావు మెప్పించింది                  

తెలుగు తెరపై వరుస విజయాలను అందుకుంటూ .. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'తేజ్ ఐ లవ్ యూ' .. ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ, " ఈ సినిమాలో నేను 'నందిని' అనే పాత్రలో కనిపిస్తాను. ఆధునిక భావాలు కలిగిన ఈ పాత్ర అందరికీ నచ్చుతుంది.

ఇటీవల 'రంగస్థలం'లో అందరి మనసులు దోచుకున్న 'రామలక్ష్మి' పాత్రను నేను చేయాల్సి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ పాత్రను నేను చేయలేకపోయాను. ఆ పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. ఆమె చేయబట్టే ఆ పాత్రకు న్యాయం జరిగింది .. ఇదే విషయాన్ని నేను సుకుమార్ గారితోను చెప్పాను. ఇక 'మహానటి'లో కీర్తి సురేశ్ .. 'సమ్మోహనం'లో అదితీ రావు కూడా ఎంతో సహజంగా నటించారు. ఇలా అద్భుతంగా నటించే వాళ్లందరినీ నేను స్ఫూర్తిగా తీసుకుంటూ వుంటాను" అని చెప్పుకొచ్చింది.                

More Telugu News